Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts
Friday, December 11, 2009
తెలుగునాడు..
"మా తెలుగు తల్లికీ మల్లె పూదండా మా కన్న తల్లికీ మంగళారతులు..."
ఒకప్పుడు ప్రతి పాఠశాలలో వినిపించే ప్రార్థనాగీతం. కానీ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరం.విద్యాధికులు,ధనికులు,పేదలూ అనే తేడా లేకుండా నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు పల్లెల్ని కూడా ఈ రొంపిలోకి లాగటానికి ప్రయత్నిస్తున్నారు.
త్రిలింగభాషగా..మొదలైన మన తేనలూరే తెలుగు భాషను ఇప్పుడు మాండలీకాలనూ, యాసలనూ వేదికగా చేసుకుని చీల్చటానికి కొన్ని శక్తులు శతధాసహశ్రధ ప్రయత్నిస్తున్నాయి..ఈ కాష్టంలో కాలుతున్నది మాత్రం సామాన్యుడు. నేను పుట్టింది, పెరిగి విద్యా బుధ్ధులు నేర్చిందీ తెలంగాణాలోనే..తల్లితండ్రులు జన్మతః కోస్తా తీరవాసులైనా నాకు హైదరాబాదే పుట్టిల్లు. ఏ ప్రాంతమైనా నాది ఆంధ్రప్రదేశ్, మాది తెలుగు భాష అని గర్వంగా చెప్పుకునే వాడిని. గత రెండు వారాలుగా సాగుతున్న రాద్ధాంతం కొత్తదేమీ కాదు ఎన్నో ఏళ్ళుగా ఉన్నదే. కానీ కొత్తగా ఇప్పుడు జరిగిందేమిట్రా అంటే.. కేంద్ర ప్రభుత్వం దీనికి స్పందించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఊటంకించటం.
శ్రీ కేసీఆర్ గారి పాచిక ఈ సారి బాగా పారిందనే చెప్పాలి. 2001 వరకు తెలుగుదేశంలో ఉండి అందులోనుండి విడిపోయి తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో ప్రత్యేక తెలంగాణా రాష్త్ర సాధనే మానిఫెస్టోగా 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపారు.అప్పుడు ఆయనకి ఇచ్చిన మంత్రి పదివిని నిర్వర్తించి కొన్నాళ్ళకే రాజీనామా చేశారు, కారణం కేంద్రం తెలంగాణాకి అనుమతి ఇవ్వలేదు అని.ఈయన ఘన చరిత్ర ఏమని చెప్పాలి? ఓ ఏడాది పాటు తన నియోజికవర్గం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకపోయేంత బిజీ అయిపోయారు...దానికి ఆయన్ని ఆ ప్రాంతం ప్రజలు నిలదీస్తే అక్కడ్నుండి ఎలాగో తప్పించుకుని బయటపడ్డారు. సొంత లాభాపేక్షతో ఆయన చేస్తున్న ప్రచారాలని ప్రజలు తెలుసుకున్నట్టున్నారు..పాపం గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు సంపాదించుకోగలిగారు..అప్పుడు ఆయన తమ ఓటమికి కారణం తెలుగుదేశంతో పొత్తేనని చెప్పుకున్నారు...అవును పాపం ప్రజలకి తెలీదు ఎవరికి ఓటెయ్యాలో. పిచ్చి జనం వారి పొత్తులతో బాధపడ్డారో లేక వారి ఎత్తులతో విసిగిపోయారో, వారిని పులుసులో లేకుండా చేశారు.
ఏదేమైనప్పటికీ ఆ పార్టీ అస్తిత్వానికి సవాలు ఎదురయింది. దానికి తోడు తోడుగా ఉంటారనుకున్న పార్టీసభ్యులందరూ మెల్లగా తలో దారీ చూసుకోవటం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైది. మింగలేకా కక్కలేకా ఎలాగో అలా తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నంలో మరో సారి తెలంగాణ గానం ఎత్తుకున్నారు. ఈ సారి కాస్త నాటకీయంగా తాను నిరాహార దీక్ష చేయబోతున్నాననీ...ఆ చెయ్యబోయే ముందు మరి బుజ్జగింపులకోసమో ఉజ్జాయింపులకోసమో అన్నట్టుగా రాష్ట్ర మరియూ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మరీ ఆ నిర్ణయం తీసుకున్నారు.
దీక్ష ప్రారంభానికి వెళ్ళె ముందు మీడియాతో "బహుశా ఇదే నేను మీకిస్తున్న ఆఖరి ఇంటర్వ్యూ కావచ్చు" అని ఓ నాటకీయ డైలాగు. ఆ తర్వాత సాగిన ఎత్తులు పైఎత్తులు, పగిలిన అద్దాలు, తగలబడిన బస్సులు,మనుషులూ, విరిగిన లాఠీలు...ఇవన్నీ అందరం చూశాం, ఆవేశపడ్డాం, చలించిపోయాం.
గాంధేయ పద్దతిలో ఆయన దీక్షమొదలుపెట్టారు బానే ఉంది...అత్యుత్సాహానికి పోయి మన పోలీసులు వీరంగం చేశారు. అది చిలికి చిలికి గాలివానయ్యింది. ఎందరో అమాయకులకు గాయాలు,ప్రాణహాని,ఆస్తి నష్టం. కానీ అంతా శాంతియుతంగా జరిగింది అని మీడియాలో వార్తలు. "శాంతియుతం" అనే పదానికి కొత్త సవరణలూ, అర్ధాలు ఉన్నాయేమోమరి వారి నిఘంటువులలో.
ఈ వారం-పదిరొజుల్లో టీవీ ద్వారా చూసిన కొన్ని దృస్యాలు, వాటి తాలూకు స్పందనలు.
ఒకానొక తెరాస నేత ఓ విలేఖరితో చెప్పటం,
నేత: "మేము మా కార్యకర్తలూ శాంతియుతంగా మా నిరసనని తెలియజేస్తున్నాము...ఎవరికి ఎలాంటి నష్టం జరగదు. ఇవాళ బస్సులు కదలకుండా బంద్ నిర్వహిస్తున్నం"
విలేఖరి: మరి ఇలా రవాణాను ఆపితే సామాన్య ప్రజ ఇబ్బంది పడదా?
నేత: లేదండీ ఇక్కడున్న ప్రయాణీకులంతా స్వచ్చందంగా తమ మద్దత్తు తెలపటానికే బస్టాండుకు వచ్చారు..వారేమీ ఇబ్బంది పడటంలేదు
(అప్పటికే దాదాపు అక్కడ 100 మందికి పైగా ప్రయాణీకులు వారి కుటుంబాలతో దిక్కుతోచక బిక్కు బిక్కుమంటూ కూర్చుని, "మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టటం భావ్యమా" అని విలేఖరులని అడగటం జరిగింది)
ఒకవేళ ఆ ప్రయాణీకులు నిజంగా స్వచ్చందంగా తమ మద్దతు తెలపటానికే ఐతే పాపం వాళ్ళూ సూటుకేసులు, పిల్లల్ని తీసుకుని బస్సు కౌంటరు దగ్గర ఎందుకుంటారో ఆ నేతగారే చెప్పగలరేమో
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం అని ఆయన చెప్తుండగానే కర్రలు పట్టుకుని "జై తెలంగాణా" అని అరుస్తూ వీధుల మీద పరిగెడుతున్న తెరాస కార్యకర్తలూ విధ్యార్ధులని చూపించారు ఆ ఛానెల్ వారు..శాంతియుతమంటే ఆయుధాలని చేతబూని ప్రజల్ని భయపెట్టటం, ఆ కారల్తో వాళ్ళు బస్సుల అద్దాలను పగల గొట్టటం అని అర్ధమేమో మరి.
న్యాయవాదులూ, విద్యావేత్తలూ, అందరూ అవకాశం దొరికింది కదా అని తమ మద్దతుని తెలిపారు... నాకు అర్ధంకానిదేమిటంటే ఇన్నాళ్ళూ ఏమైంది? ఇప్పుడు కొత్తగా ఓ వ్యక్తి/నేత నిరాహార దీక్షతో ఇంతగా స్పందించినవారు ఇన్నేళ్ళుగా జరుగుతున్న ఆకలి చావులను గమనించలేకపోయారా? ప్రజా శ్రేయస్సుకంటే ఓ నాయకుడే ముఖ్యమా? ఆయనమీద అంత గౌరవమూ నమ్మకమూ ఉండి ఉంటే గత ఎన్నికలలో ఆయన్ని (ఆ పార్టీని) ఎందుకు గెలిపించలేదూ?
మొదటిరోజు ఆసుపత్రిలో ఆయన దీక్ష విరమించినట్టు ఆయన పళ్ళరసం తాగుతున్నట్టు మీడియా చూపించింది..దానికి ఉద్రేకులైపోయిన ప్రజ ఆయన్ని దూషించటం మొదలుపెట్టింది. మరి అది తెలుసుకుని భయపడ్డారో ఏమో వెంటనే విలేఖర్లని సమావేశపెట్టి "తాను దీక్ష కొనసాగిస్తున్నట్టు తెలియజేసారు...అది పళ్ళరసం అని ఆయనకి తెలీదనీ ఇంకేదో అనీ" చాలా చెప్పారు...ఇంకేదో ఐనా ఎందుకు తాగారో మరి ఆయనకే తెలియాలి.శరీరంలోకి ఏదో రూపేణా సత్తువని అందజేస్తూ ఆయన్ని దీక్షలో కొనసాగించినవారికి జేజేలు..
ఇక విద్యార్ధులు ఇతర్త్రా శ్రేణుల జనం చేసిన వీరంగం అంతా ఇంతా కాదు...కనపడిన ప్రతివాడినీ కెలకటం మీడియా వంతైతే...దొరికిన ప్రతి మైకులోనూ పూనకించి మాట్లాడటం వారి వంతూ అయ్యింది.
బస్సులు,విగ్రహాలు,సంస్థా కార్యాలయాలు కావేవీ విధ్వంశానికి అనర్హం అని కనపడిన వాటిలో చాలానే ధ్వంసం చేయటం, వారి చర్యలని నేతలు చాలా గొప్పగా వెనకేసుకురావటం. చూస్తుంటె మతి పోతుంది...మన ఆస్తికి మనమే నష్టం కలిగించుకుంటూ...మన పూర్వీకులనీ మన భాష ఔన్నత్యాన్నీ మనమే పాడుచేసుకోవటం ఏం లక్ష్య సాధన? స్వర్గీయ ఎన్.టీ.ఆర్ (తెలుగు వారందరం ఒకటి మనం ఓ శక్తి అని చాటినవారు), శ్రీ పొట్టి శ్రీరాములు(ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణం అర్పించినవారు) ఇలా ఎందరివో విగ్రహాలని ధ్వసం చేశారు. ఇంకా నయం శ్రీ కృష్ణదేవరాయలూ, అన్నమయ్య మొదలగువారి విగ్రహాలని కూడా ధ్వంసం చేసేస్తారేమొ అని భయపడ్డాను. కారణం వారు తెలంగాణేతర వ్యక్తులు.
నేతలు చెప్పటం ఒక ఎత్తు, జనం నమ్మటం మరో ఎత్తు...నేతల్లో కొందరు "మాకు తెలంగాణా కావాలి ఆంధ్రా మరియూ రాయలసీమ వాసులు మాకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలి వారిని ఇక్కడి నుండి తరిమి కొట్టాలి" అని అంటు ప్రసంగాలు ఇచ్చారు. ఎవరినైనా ఎలా వెళ్ళగొట్టగలరు? రాజ్యాంగబధ్ధంగా, చట్టబధ్ధంగా అది ఎలా సాధ్యం? ప్రతి భారతీయునికీ తాను ఉండాలనుకునే చోట ఉండటానికీ పనిచేసుకోటానికీ సర్వహక్కులూ ఉన్నాయి. ఇది అర్ధం చేసుకోలేని వారు నేతలై ప్రసంగాలివ్వటం వారిని ప్రజలు వినటం. చదువుకున్నవారు కూడా ఈ ప్రలోభవాక్యాలను నమ్మటం విస్మయం కలిగిస్తుంది. కొందరు ఆదివాసీ తెగలు, చదువుకోని వారు తెలియక నేతలు చెప్పిన భాష్యాలకి చప్పట్లు కొడుతున్నారు.ఒకవేళ ఆ తెలంగాణా నేతలన్నట్టు తెలంగాణేతర వ్యక్తులు వెళ్ళిపోవాలి ఇక్కడుండకూడదూ అంటె...పరాయి రాష్ట్రాల్లో/దేశాల్లో/ఖండాల్లో ఉన్నావారందరిని తమ తమ ప్రాంతాలకి తరళి రమ్మనండి. అక్కడెక్కడొ కూర్చుని ఎగరటం కాదు ఇక్కడికి వచ్హ్చి మాట్లాడమనండి. ఉద్యమంలోని అర్ధాన్ని కనీసం ఓ పది శాతానికైనా తెలియనివ్వండి...చాలామంది మాండలీకాలని బట్టి ప్రాంత విభజన జరుగుతుంది అనే అపోహలో ఉన్నారు...ఒకవేళ అదే ఐతే మనకి ప్రతి జిల్ల ఓ రాష్ట్రంగా ఏర్పడుతుంది...ఒక్కో జిల్లలో కూడా మరిన్ని యాసలున్నాయి మనకి మరి వాటిని కూడా విభజించాలేమో.మనలో మనం కొట్టుకు చావటం ఆపితే మనల్ని కీలు బొమ్మలు చేసి ఆడుతూ వినోదిస్తున్నా వారిని చూడగలుగుతాం.
నాకు తెలిసినంతవరకు గ్రహించినంతవరకు...తెలంగాణ,రాయలసీమా,కోస్తా సామాన్య ప్రజలకు ఎటువంటి ద్వేషాలూ లేవు స్వార్ధ రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగంలో పావులుగా మారుతున్నారందరూ.
వాహనాలపైన ఏపీ అని కనిపిస్తే అది కొట్టేసి టీజీ అని రాయటం, ఆర్.ఎస్ బ్రదర్స్, ఆంధ్ర బ్యాంకు వంటి వాటి మీద ప్రతాపం చూపించటం దేనికి? ఆర్.ఎస్ బ్రదర్స్లో తెలంగాణా వాసులకు బట్టలు అమ్మం అని చెప్పారా?ఆంధ్రా బాంకులో తెలంగాణా ఖాతాదారులు లేరా? పేరు వల్లే మీకు ఇబ్బంధి ఐతే ఆంధ్రప్రదేశ్ ని తెలుగునాడు అని పిలుచుకుందాం ఏమంటారు?
ఓ వ్యక్తి మైకు దొరకగానె కేసీఆర్ ని ఉద్దేశిస్తూ "అన్నా బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు కానీ నువ్వు చావద్దొన్నా నువ్వు దీక్ష విరమించి ఉద్యమం సాగించు" అని అన్నారు..."బతికుంటే బలుసాకు తినటం" అనే వాక్యం నాకెంతో నవ్వు తెప్పించింది.ఆ సంధర్భంలో అది వెటకారంగా వాడినట్టనిపించింది...ఆ వెరితనానికి నవ్వుకున్నాను
ఆ కేసీఆర్ గారు ఆసుపత్రిలొ ఉన్నంతకాలం చాలా సీరియస్ గా ఉన్నారు పరిస్థితి విషమం నేడో రేపో అని గోల పెట్టారు మరి అంత దయనీయ స్థితిలో ఉన్నా ఆయన ఓ గ్లాసుడు నిమ్మరసం తాగగానే..ఎమర్జెన్సీ నుండి మామూలు గదికీ మరునాడు ఇంటికీ ఎలా వెళ్ళగలిగారో ఆ ఈశ్వరుడికే తెలియాలి.
అప్పటిదాకా గోలలని చూసిన అధికార పార్టీ శ్రేణులు, ప్రతిపక్షాలు అందరూ వారి వారి మద్దత్తు తెలిపారు ఉద్యమానికి...ప్రజల్లో వారి ఉనికిని చాటుకోటానికి...వారి ఉనికిని కాపాడుకోటానికి..కానీ ఆ పంధాలో ప్రజల్లో ఎన్నో ఉద్వేగాల్ని రేపారు.
ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణా అని కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించగానే అందరూ కేసీఆర్ ని పొగిడారు..ఆ నిర్ణయాన్ని ఎప్పుడైతే తెలంగాణేతర ప్రజలు వ్యతిరేకించారో ఈ "గోపీ" నేతలు(గోడమీద పిల్లులు) అందరూ ప్లేటు ఫిరాయించే దారిలో పడటంలోనే ప్రజలకి అర్ధంకావాలి వారి అవకాసవాదాలు...ఇప్పుడు రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేయాలి ఎవరెవరు ఎవరెవరిని పంచుకోవాలి అని మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు సమైఖ్యంగా ఉండి ఇలాంటి వాళ్ళకి బుధ్ధి చెప్పాలి..తెలంగాణా వాసులకి ఇతర ప్రాంత వాసుల పట్ల ఎటువంటి ద్వేషాలు లేవని చాటి చెప్పాలి. భగ్గుమంటున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
తెలంగాణా మీద కేంద్రం నిర్ణయం తొందరపాటే అనిపిస్తుంది ఇన్నాళ్ళుగా స్పందించనిది ఇవాళ కొన్ని గొడవలూ ఓ నేత నిరాహారదీక్ష(?) కి తలొగ్గటం హాస్యస్పదమే కాదు ఆందోలణకరం కూడా..ఇలా ప్రభుత్వం తలొగ్గి ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం ఏంటి? అంధ్రప్రదేశ్ ని విడదీయటం కేవలం తెలంగాణా వాసుల చేతిలో ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ అనేది అందరిదీ కదా?మరి అలాంటప్పుడు మిగతా వారిని సంప్రదించకుండా రాత్రికి రాత్రి ఎలా నిర్ణయం తీసుకుంటారు? అదే విషయంగా అందరిలోనూ నిరసన వ్యక్తమవుతుంది..ఏదేమైనా ఇప్పుడు రాజకీయపరంగా అందరూ ప్రజలని బాగా మభ్యపెడుతున్నారు.దీనివల్ల ఏమి జరిగినా జరగకున్నా అందరిలో ఓ ఉత్కంఠత, ఓ అర్ధంకాని పరిస్థితి. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్నవాళ్ళు, వ్యాపారాలు చేస్తున్నవాళ్ళు ఇలా అందరికీ ప్రశ్నార్ధకం. లోకల్/నాన్-లోకల్ ల గోల.India is a Sovereign,democratic,secular,republic country free from religious and regional fanaticism. Lets remain thus and respect each other as public than being in a herd of sheep to follow uneducated political personnel or the so called "Leaders" Lets pray that these people will get into their senses soon and stop tormenting people's sentiments and emotions. lets be wise and not behave as uneducated literates. Lets deal with the crisis together and workout unitedly.
ఇట్లు భవదీయుడు,
దారినపోయే దానయ్య
Wednesday, July 1, 2009
దానయ్య మోక్షం
నమస్కారమండీ బాగున్నారా? ఏవిటీ …ఈ దానయ్య ఇంతకాలం యే దారినా కనపడలేదు, ఇన్నాళ్టికి మళ్ళీ ఇలా దర్శనమిచ్చాడు అని అనుకుంటున్నారా?
హు…ఏమి చెప్పమంటార్లేండి…కడుపు చించుకుంటే దారి పాడవుతుందనీ..
ఓ ఆదివారం రోజు ఎప్పటిలా కాక నా దారినపోయే కార్యక్రమాలకు సెలవిచ్చ్చి ఇంట్లొ టీ.వీ. చూస్తూ మా ఆవిడ అప్పుడే కాచి ఇచ్చిన వేడి వేడి కాఫీ తాగుతూ పేపరులోని వార్తలని ఏదో పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థి రేంజి లో చదువుతూ కూర్చున్నాను.ఇంతలో పెరట్లోనుండి మా ఆవిడ యంగు సూర్యకాంతం, మా పనిమనిషి ఓల్డు రంభల పరస్పర అరుపులు వినపడ్డాయి. నాకెందుకులే అని నేను తాపీగ నా కాఫీని చప్పరిస్తూ ఈనాడు లో “ఇదీ సంగతి” చదివి పడీపడీ నవ్వుకుంటూ కూర్చున్నాను.
మా యంగు సూ.కాం. రుసరుసలాడుతు వంటింట్లోకి వెళ్ళి అటు మూడు గిన్నెలూ , ఇటు ఆరు గరిటెలూ విసిరేసి “యేవండోయ్ ఆ పనిమనిషి పీనుగని ఇక రావద్దనేశాను, దేబ్యం మొఖమూ అదీను, దానికి జీతం పెంచాలిట. పోనిలే ఒకటి, రెండు అంటే, కాదట మరీ ఒకేసారి ఐదు పదులు పెంచాలిట. ఇప్పుడు ఇస్తున్న మూడు వందలే దానికివ్వటం నాకు ససేమిరా ఇష్టం లేదు అయినా ఏదో పెద్దముండ, మొగుడు సంపాదించడు పాపం అని మన పాత పనిమనిషి రికమండేషను చేస్తే జాలి పడి పెట్టుకున్నను. ఇది చూడండి చేరి పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే జీతం పెంచాల్ట." గుక్కతిప్పుకొకుండా పురాణం చెప్పింది మా ఆవిడ, చేతిలో అప్పడాలకర్ర పట్టుకుని. ఆ కోపంలో ఎక్కడ ఆ చెయ్యి నామీద విదిలిస్తుందోనని,"పోనీలేవే యాభయ్యేగా, అసలే ధరలు విజయవాడ వేసవిలా మండుతున్నాయి, పైగా నీకు తెలియదేమో బయట ఎక్కడా కూడా ఇంత చవకగా పనివాళ్ళు దొరకరే. మన పక్క వీధిలో రామంగాడు లేడూ, వాళ్ళింట్లొ ఇద్దరే కదా ఉంటా ఐనా వాడి పనిమనిషి ఐదు వందలు తీసుకుంటుందిట, ఆవిడతో పోలిస్తే మన పనిమనిషి నయం కదే" అన్నాను. ఏమనుకుందో ఏమో చేతిలోని అప్పడాల కర్రని ఓ మూలకి గిరాటు వేసి “అసలెందుకండీ యే పనిమనిషి అక్కర్లేకుండానే మన పనులయ్యే మార్గముందండీ” అంది ఆల్రెడీ భూచక్రాల్లా ఉండే కళ్ళని బండి చక్రాలంతవిగా చేస్తూ. “ హేవిటే అదీ కొంపదీసి మీ అమ్మనిగాని పిలుస్తున్నావా ఏవిటి పనిలుచెయ్యటానికి ?” అని అడిగాను నవ్వుతూ, “ఆ.. లేదు మా అమ్మమ్మని పిలుస్తున్నాను, వెఱ్ఱి మిరపకాయ మాటలు మాట్లాడకండి నాకు మండుతుంది…. మొన్న మన పొరిగింటి పంకజమూ నేను చక్రవాకం సీరియలు గురించి కబుర్లాడుకుంటుంటే మాటల మధ్యలో తను తన పనిమనిషిని మానిపించానని చెప్పింది, నేను, ‘అయ్యో మరెల వదినా ఇంటెడు చాకిరి నువ్వే చేసుకుంటున్నావా పాపం? ‘అని అడిగాను దానికి వదినేమందో తెలుసా?” అని ఒక చిన్ని విరామమిచ్చింది ఊపిరి తీసుకోటానికి, “ఇంతకీ ఏమందే?” చిరాకు ప్రదర్శించాను నేను. “ అబ్బ ఉండండీ… అసలు వాళ్ళింట్లొ అన్నయ్యగారు కూడా పంకజానికి సాయం చేస్తారట పొద్దున్నే పిల్లల్ని రెడీ చేయటం, ఆఫీసుకి వెళ్ళేప్పుడు కారియరు సర్దుకోవటం వంటివి ఆయనే చేస్తారట, అంతేకాదు సాయంకాలం ఇంటికి వచ్చాక ఉతికి ఆరేసిన బట్టల్ని మడతపెట్టడం, పిల్లలకి హోంవర్కులు చేయించటం పాలు కలిపివ్వటం అణ్ణం తినిపించి నిద్రపుచ్చటం కూడా చేస్తారట.” అని అంది మారుతున్న నా ముఖకవళికల్ని ఓరకంట గమనిస్తూ. ఏదొ ముంచుకొస్తోంది, అని గ్రహించిన నా కాళ్ళు వాటంతటవే అక్కడ్నుండి జారుకోమని మెల్లిగా కుర్చీలో నుండి లేవటం మొదలు పెట్టాయి… అది గమినించిన మా సూర్యకాంతం నా చెయ్యి పట్టుకుని కుర్చీలోకి నెట్టి కుర్చీ చెయ్యి మీద కూర్చుని నా బుజం మీద చెయ్యి వేసి గోముగా, “ ఏమండీ మనం కూడా అలా పనుల్ని పంచుకుందామండీ ఎంచక్కా పనమ్మాయి అవసరముండకుండా పనులన్ని అయిపోతాయి” అని అంది, త్వరగా ఏదో ఒక పాచిక వేసి అక్కడ్నుండి తప్పించుకోవాలని నేను, “చూడు బంగారం ఆ పక్కింటి దద్దోజనం మొహంగాడు ఏదో అలా చేస్తున్నంత మాత్రాన అందరికీ అది కుదుర్తుందా?, వాడు వెలగబెట్టేది సర్కారి కొలువులో ఉద్యోగమాయె, ఎన్నింటికి వెళ్ళినా గవర్నమెంటు ఉద్యోగంలో అడిగే నాథుడెవడుంటాడు? అక్కడికి వెళ్ళాక కూడా చక్కగా ఫ్యాను కింద గురకపెట్టడం తప్ప వాళ్ళకి పనేమి ఉండదే బోలెడు రెస్టూ… ఇక ఆ మాత్రమన్నా పనులు చెయ్యకపోతే అసలే లావు, ఇంకా బండగా అవుతాడు, వాడలా పని చేస్తే కాస్త బరువన్న తగ్గుతాడని దాక్టరు చెప్పుంటాడు అందుకే అలా చేస్తున్నాడే….. అంతమాత్రానికే వాడేదొ పరోపకారి పాపన్న లా ఇంటెడు చాకిరి చేస్తున్నట్టు అనుకుంటున్నావు నువ్వు… నిజం అర్ధం కాక నన్ను కూడా వాడిలా చెయ్యమంటున్నావు” అన్నాను నేనేదో రమణారావు లా సన్నగా ఉన్నట్టు.
అదంతా నాకనవసరం అన్నట్టు ఒక సారి గోడకున్న గడియారంకేసి చూసి, “ఆగండి చంటిగాడు నిద్రలేచే సమయం అయ్యింది, మళ్ళీ ఏడుస్తాడు కనపడకపోతే, వాడిని లేపి మీతో మాట్లాడతాను, ఇంతలో కొంచం ఆ పొయ్యి మీదున్న పాలని ఆరబెట్టి ఆ గట్టు మీదున్న వెండి గ్లాసులో పోసి ఆరబెట్టండి, చంటోడికి పట్టాలి అని హుకుం జారీ చేసి చంటోడి దగ్గరికి వెళ్ళింది లేచానా లేదా అని ఓ సారి మధ్యలో వెనక్కి తిరిగి చూసి…ఇంకేం చేస్తాం పోనిలే ఈ ఒక్క పని చేద్దాం ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఆ పనిమనిషిని బతిమిలాడో బామాలో మళ్ళీ రప్పిద్దామని అనుకుని వంటింట్లోకి దారితీసాను. పాలని “వెండి” గ్లాసులో (వీడి బారసాలలో చంటోడికి వెండి గ్లాసు, కాంతానికి బంగారు గ్లాసు, నాకేమో ఇత్తడి గ్లాసూ చేయించింది మా అత్త, ఇదేంటత్తా అని అడిగితే పుత్తడి బొమ్మలాంటి మా అమ్మాయిని ఇచ్చానుగా అదే నీకెక్కువల్లుడూ అంటూ లౌక్యంగా ఇచ్చిన ఆ ఇత్తడి గ్లాసుని కూడా లాగేసుకుంది మా సీనియరు సూర్యకాంతం) పోసుకుని ఆరబెడుతూ చంటోడి దగ్గరికి తీసుకెళ్ళాను, గ్లాసుని కాంతానికి ఇవ్వబోయేంతలో “ఏవండేవండి మా బుజ్జి కదూ కొంచం వీడికి పాలు పట్టండి కూరగాయలవాడొచ్చాడు వెళ్ళి ఓ నాలుగు కూరగాయలు కొంటాను, సొరకాయుంటే తీసుకుంటాలెండి, మీరెప్పట్నుండో అడుగుతున్నారుగా దప్పళం పెట్టమని.. “ అని వాకిట్లోకి పరిగెత్తింది ‘ఓ కూరలబ్బీ’ అని అరుచుకుంటూ, ఎదురుగా నిద్రమొహమేసుకుని నన్నే చూస్తున్న చంటిగాడిని చంకనేసుకుని, పాలుతాగించాను ‘ అమ్మో ఏదో ఒకటి చేసెయ్యాలి లేకుంటే నా పని ఇక ఇంటి పనే’ అనుకుంటూ, అప్పుడు నాకు తెలియదు ఇది ఆరంభానికి ఆరంభం మాత్రమేనని.
మొదటి రోజనే సాకుతో ఆవేళ నాకు పాలుతాగించటం వంటి చిన్న చిన్న పనులే చెప్పింది, ఆ మరుసటి రోజు నాకు ప్రమోషను చంటాడికి స్నానం, మధ్యాహ్నం అన్నం కడిగి పడేయటం… ఇలా నెలరోజులయ్యేటప్పటికి…. పొద్దున్నే కోడికూసేవేళకి లేచి పాలవాడి దగ్గర పాలు తీసుకుని కాఫీ పెట్టటం, ఈ లోగా మా ఆవిడవెళ్ళి వాకిలూడ్చి ముగ్గేసి రావటం, తను స్నానము మరియు పూజ ముగించుకుని వచ్చేలోగ నేను అంట్లు తోమి, కూరగాయలు తరగటం… ఇలా మొదలయ్యే దినచర్య సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక బట్టలు మడతపెట్టి ఇస్త్రీ చెయ్యటం (ఇది నా దినచర్యలో కొత్తగ చేరిన పని… అవును మరి ‘చాకలి వాడికెందుకు జతకి మూడున్నర రూపాయలు దండగ కదూ’,మా ఆవిడ ఉద్దేశ్యం) ఆ తర్వాత రాత్రికి భోజనం సిద్ధం చేసి, తిని తొంగోవటం ఇది మా పక్కింటి పంకజాక్షి మొగుడి పుణ్యమాని నా మెడకి చుట్టుకున్న సారీ చుట్టిన ఢోలు.
మరుసటి రోజు ఉదయం మా కాంతం ఎవరితోనో ఫోనులో ఓ ముప్పావుగంట మాట్లాడి మెల్లిగా వచ్చి “ఏవండోయ్ మా బందరు బాబయిగారు లేరూ…” అంటు నా చెవిలో ఊదింది, నేను, “ఎవరూ మీ సీత పిన్ని వాళ్ళాయనేగా? ఏమయిందాయనకి?” అని అడిగాను, “ఏమీ కాలేదండి ఆయనకి మన ఊరిలో ఏదో పని ఉందిట, రేపు సాయంకాలం బండికి మా పిన్నిని తీసుకుని వస్తున్నారట, మన ఇంట్లోనే బస” చల్లగా చెప్పింది కాంతం, “ఓహొ ఎన్ని రోజులుంటారో?” అడిగాను. “ఏమిటండీ మా వాళ్ళు వస్తున్నారు అనగానే మీరు అడిగే మొదటి ప్రశ్న అదేనా…అసలు కొంచమన్నా మర్యదివ్వండి మా వాళ్ళకి, మావాళ్ళేమి గతిలేక రావటం లేదు మన ఇంటికి, ఏదొ పని ఉండి వస్తున్నారు తీరా వచ్చాక ఈ ఊళ్ళో వాళ్ళమ్మాయిని నేనుండగా ఎక్కడో ఉంటే నేను బాధపడతాననే కానీ వాళ్ళేమీ దిక్కులేక రావటంలేదు సుమండీ…… ఐనా ఎణ్ణాళ్ళుంటె మీకెందుకూ… ఉంటారండి ఓ వారం రోజులుంటారు, లేకుంటే నెల రోజులుంటారు అసలిక్కడే ఉండిపోతారండి” అని ముక్కు ఎగబీలుస్తూ లోపలికెళ్ళి పోయింది. తిరణాళ్ళలో తప్పిపోయిన పిల్లవాడిలా నేను బిక్కమొహమేశాను, అసలిప్పుడేమన్నాని? ఎణ్ణాళ్ళుంటారు అని అడిగినంతమాత్రానికేనా ఈ రాద్దాంతం? లేక తెలియక నేనెమైనా అనేసానా? లేదే అంతే కదా నేను అంటా? అసలేంజరిగింది ఇప్పుడు? అని యక్షప్రశ్నలు వేసుకుంటూ పాలు పొంగబెట్టేశాను.
మూలిగే నక్కమీద తాటికాయన్నట్టు అది గమినించిన నా భార్యామణి, "ఇప్పుడేమన్నానని, ఎంత ఉక్రోషమైతే మాత్రం అలా వరాలంటి పాలు పొంగబెట్టేస్తారా ఇప్పుడు చంటోడికి పాలెలాగ? బజారుకెళ్ళి పాలు పట్రండి అని మళ్ళీ ఒకసారి హూంకరించి స్నానాలగది వైపుకి వెళ్ళింది". “ఎవరు చేసిన తప్పు వారనుభవించకా…..” అని పాడుకుంటు పొంగిన పాలు శుభ్రంచేసి తలుపులు ఓరగా వేసి మా వీధిచివరనున్న కిరాణ కొట్టుకెళ్తూంటే ఆ కొట్టు కోమటి తో మాట్లాడుతూ కనిపించింది ఆవిడ. వెంటనే గజేంద్రమోక్షంలోని పద్యాలన్ని నెమరువేసుకుంటూ ఆమెవైపు పరిగెత్తాను.
ఆమె ఎవరో కాదు మా ఓల్ద్ రంభ, అదే మా పనిమనిషి, ఎక్కడాలేని ప్రేమ, మమకారాలు నా గొంతులో మేళవించుకుని, “ఇదిగొ పెంటమ్మా (ఇదే మా పనిమనిషి అసలు పేరు), ఏమిటి అసలు రావటమే మానేశావు, రెండు వారాల క్రితం ఒకట్రెండుసార్లు వచ్చాను నిన్ను కలుద్దామని కాని నువ్వు ఊళ్ళో లెవని అన్నారు” అడిగాను ఏమీ తెలియనోడిలా, “ఏటో బావుగోరు, నానేట్సేయనేదు ఐనా అమ్మగోరు నాతో ఉత్తిపుణ్నానికి గొడవపడేసి నన్ను పొమ్మన్నరు. అసలేటయిందొ ఏటో, పెద్దోళ్ళని నేనొల్లకున్నానయ్య, నానిప్పుడు కూడా రమ్మంటే బాలొచ్చెత్తానయ్యగోరు” అని అంది, నాకర్ధం కాలేదు, “అదేమిటే ఏమీ అవ్వకుండా అలా ఎందుకు అంది? నువ్వేమైనా జీతం పెంచమన్నావా?”..”లేదు బాబయ్య నానెందుకు అడుగుతాను, మీరెంతిత్తె అంతేనమ్మ అనే గందా నాను మాటాడింది, నానడగలేదు బావు” ఇది విన్న నాకు దిమ్మ తిరిగింది. ఆ కోమిటి వాడి కొట్లోనుండి బ్యాక్ గ్రౌండులో పాట “ ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే…”. “సరే పెంటమ్మా నేనమ్మగారితో మాట్లాడి నీకు కబురుపెడతాన్లే, వచ్చి చేరుదువుగాని” అని అన్నాను, “అట్టానె బావు మారాజువి మళ్ళీ పని ఇప్పిత్తానంటాండావు, సల్లంగుండు” పాలు తీసుకుని వెనక్కి వస్తూ ఆలోచనలో పడ్డాను.
ఇంటికి వస్తూనే “ఏమే ఇలా రా నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఏంటొ, కాస్త మంచినీళ్ళు పట్టుకునిరా” అంటూ కుర్చీలో కూలబడ్డాను, “అయ్యో ఎమయిందండీ ఇందాక వరకూ బానే ఉన్నారుగా” అంటు నీళ్ళ గ్లాసు పట్టుకుని కంగారుగా వచ్చింది “ ఏమోనే ఈ మధ్య రోజూ ఇలా అవుతోంది పని వల్లనేమోలే అని ఊరుకున్నాను, కానీ ఈవేళ మరీ ఎక్కువగా ఉంది”, “హయ్యో ఏమిటండీ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, ఇలా అవుతుందనుకుంటె పని అమ్మాయిని మానిపించేదానిని కాదు” అంది, హమ్మయ్య రూటులోకొచ్చిందనుకుంటూ “పోనీ ఇప్పుడు మాత్రమేమయ్యింది ఆ పెంటమ్మని మళ్ళీ రమ్మనరాదూ, పనిలోకి, ఇక నావల్ల కాదే ఇలా బండెడు చాకిరి చెయ్యటం నే వెళ్ళి బ్రతిమిలాడి వస్తాను నీకభిమానమడ్డొస్తే, అసలే మీ బాబాయిగారొస్తున్నారంటున్నావు పని పెరుగుతుంది, పైగా నేను పెద్దగా ఏమి చెయ్యకున్నా వాళ్ళు ‘చూడు పాపం అబ్బాయి చేత ఇంటెడు చాకిరి చేయిస్తుంది కాంతం’ అని ముక్కునవేలేసుకోరూ? ” దీనంగా అన్నాను, “నిజమేనండీ కాని ఆ పీనుగ డబ్బులు పెంచమంటుంది కదండీ ఇప్పుడెళ్ళి పిలిస్తే లోకువైపోమూ”… అని అంది నీళ్ళు నములుతూ, బిత్తర చూపులు చూస్తూ, మొన్న నేను “నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి” అని పాడుకుంటూ ఇల్లు తుడుస్తున్నప్పుడు ఆ మహాతల్లి వినిందేమొ ఈ సీతమ్మ పిన్ని రూపంలో నన్ను ఆదుకుంది అని ఒకవైపు సంబరపడుతూ, “సర్లేవే నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడివస్తాను సాయంత్రానికి మీ పిన్నీవాళ్ళొస్తారు కదా, ఇక దాని జీతం అంటావా పైస కూడా పెంచను, ఆ రెండు వీధులవతలి మూడో గుడిశేగా అదుండేది” అని అడిగాను వాకిలి వైపు వెల్తూ. ఓక్కసారిగా లేడి పిల్లలా ఛెంగున ఎగిరి నా చెయ్యి పట్టుకుని, “ వద్దులెండి మీరు వెళ్తే ఒకటి నేను వెళ్తె ఒకటీనా, నేనే వెళ్తాను ఏదొ ఒకటి చెప్పి మళ్ళీ పనిలోకి రమ్మని అడుగుతానులె” అని పనిమనిషిని పిలవటానికి వెళ్ళింది మా ఆవిడ.
ఒక గంటాగి మా కాంతంతో కూడా వస్తున్న పెంటమ్మను చూస్తే ఎప్పటిలా చింపిరి జుత్తూ, ఎత్తుచీర కట్టుకునుండే మా ఓల్డు రంభ పెంటమ్మే, గజేంద్రుడ్ని కాపాడటానికి చింద్రవందరగా వస్తున్న శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపించింది నాకు. ఆవేల్టి సాయంత్రం మా కాంతం జరిగినదంతా వాళ్ళ పిన్నితో “చూడవే అమ్మ చెప్పిందికదా అని మా పక్కింటి పంకజాం దగ్గర డాబు పోటానికి మీ అల్లుడుగారిచేత పనులు చేయించానా, ఇప్పుడెమో నీ రాక పుణ్యమాంట మళ్ళీ కథ మొదటికొచ్చింది పైగా ఆ పెంటమ్మకేమొ ఇప్పుడు నిజంగానే మూడువందలాయాభై ఇవ్వాల్సివస్తుంది, అసలు అది నాలుగు వందల దగ్గర బేరం మొదలు పెట్టింది, లేకుంటే మీ ఇంట్లో ఇన్ని రోజులు అన్ని పనులూ చేసింది మీ అల్లుడుగారే అని ఊరంతా టాంటాం వేస్తానని భీష్మించుక్కూర్చుంది పైగా జరిగినదంతా మీ అల్లుడిగారికి చెప్పేస్తానని బెదిరించింది దొంగముండ, ఆఖరికి బ్రతిమిలాడి బామాలి మూడువందలయాభైకి మాట్లాడాల్సి వచ్చింది యే గొడవాలేకుండా మూడు వందలకి పనిచేసే దానిని అనవసరంగా గొడవపడి పంపినందుకు నాకు తగిన శాస్తి జరిగింది” అని చెప్పుకుంటూ వాపోయింది. పాపం ఈ దానయ్యే పనిమనిషిచేత అలా బెట్టు చేయించాడని తెలియదు తనకి…
ఇదండీ నా ఈ రెండు నెలాల అఙాతవాసానికి కారణం ఏవిటీ అఙాతవాసంతో పోల్చానని చూస్తున్నారా? మరి అఙాతవాసంలోనే కదండి అంత గొప్పవారైన పాండవులే పనివాళ్ళుగా మారిందీ.. ‘కుంజరయూదంబు దోమకుత్తుకజొచ్చెన్’ అని…. ఇక పై మళ్ళీ మామూలుగానే మరీ ఇంత గ్యాపు లేకుండా మీతో మాట్లాడతానని ఆశిస్తు…
భవదీయుడు,
ఇప్పుడే మళ్ళీ దారిలోకొస్తున్న దానయ్య.
హు…ఏమి చెప్పమంటార్లేండి…కడుపు చించుకుంటే దారి పాడవుతుందనీ..
ఓ ఆదివారం రోజు ఎప్పటిలా కాక నా దారినపోయే కార్యక్రమాలకు సెలవిచ్చ్చి ఇంట్లొ టీ.వీ. చూస్తూ మా ఆవిడ అప్పుడే కాచి ఇచ్చిన వేడి వేడి కాఫీ తాగుతూ పేపరులోని వార్తలని ఏదో పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థి రేంజి లో చదువుతూ కూర్చున్నాను.ఇంతలో పెరట్లోనుండి మా ఆవిడ యంగు సూర్యకాంతం, మా పనిమనిషి ఓల్డు రంభల పరస్పర అరుపులు వినపడ్డాయి. నాకెందుకులే అని నేను తాపీగ నా కాఫీని చప్పరిస్తూ ఈనాడు లో “ఇదీ సంగతి” చదివి పడీపడీ నవ్వుకుంటూ కూర్చున్నాను.
మా యంగు సూ.కాం. రుసరుసలాడుతు వంటింట్లోకి వెళ్ళి అటు మూడు గిన్నెలూ , ఇటు ఆరు గరిటెలూ విసిరేసి “యేవండోయ్ ఆ పనిమనిషి పీనుగని ఇక రావద్దనేశాను, దేబ్యం మొఖమూ అదీను, దానికి జీతం పెంచాలిట. పోనిలే ఒకటి, రెండు అంటే, కాదట మరీ ఒకేసారి ఐదు పదులు పెంచాలిట. ఇప్పుడు ఇస్తున్న మూడు వందలే దానికివ్వటం నాకు ససేమిరా ఇష్టం లేదు అయినా ఏదో పెద్దముండ, మొగుడు సంపాదించడు పాపం అని మన పాత పనిమనిషి రికమండేషను చేస్తే జాలి పడి పెట్టుకున్నను. ఇది చూడండి చేరి పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే జీతం పెంచాల్ట." గుక్కతిప్పుకొకుండా పురాణం చెప్పింది మా ఆవిడ, చేతిలో అప్పడాలకర్ర పట్టుకుని. ఆ కోపంలో ఎక్కడ ఆ చెయ్యి నామీద విదిలిస్తుందోనని,"పోనీలేవే యాభయ్యేగా, అసలే ధరలు విజయవాడ వేసవిలా మండుతున్నాయి, పైగా నీకు తెలియదేమో బయట ఎక్కడా కూడా ఇంత చవకగా పనివాళ్ళు దొరకరే. మన పక్క వీధిలో రామంగాడు లేడూ, వాళ్ళింట్లొ ఇద్దరే కదా ఉంటా ఐనా వాడి పనిమనిషి ఐదు వందలు తీసుకుంటుందిట, ఆవిడతో పోలిస్తే మన పనిమనిషి నయం కదే" అన్నాను. ఏమనుకుందో ఏమో చేతిలోని అప్పడాల కర్రని ఓ మూలకి గిరాటు వేసి “అసలెందుకండీ యే పనిమనిషి అక్కర్లేకుండానే మన పనులయ్యే మార్గముందండీ” అంది ఆల్రెడీ భూచక్రాల్లా ఉండే కళ్ళని బండి చక్రాలంతవిగా చేస్తూ. “ హేవిటే అదీ కొంపదీసి మీ అమ్మనిగాని పిలుస్తున్నావా ఏవిటి పనిలుచెయ్యటానికి ?” అని అడిగాను నవ్వుతూ, “ఆ.. లేదు మా అమ్మమ్మని పిలుస్తున్నాను, వెఱ్ఱి మిరపకాయ మాటలు మాట్లాడకండి నాకు మండుతుంది…. మొన్న మన పొరిగింటి పంకజమూ నేను చక్రవాకం సీరియలు గురించి కబుర్లాడుకుంటుంటే మాటల మధ్యలో తను తన పనిమనిషిని మానిపించానని చెప్పింది, నేను, ‘అయ్యో మరెల వదినా ఇంటెడు చాకిరి నువ్వే చేసుకుంటున్నావా పాపం? ‘అని అడిగాను దానికి వదినేమందో తెలుసా?” అని ఒక చిన్ని విరామమిచ్చింది ఊపిరి తీసుకోటానికి, “ఇంతకీ ఏమందే?” చిరాకు ప్రదర్శించాను నేను. “ అబ్బ ఉండండీ… అసలు వాళ్ళింట్లొ అన్నయ్యగారు కూడా పంకజానికి సాయం చేస్తారట పొద్దున్నే పిల్లల్ని రెడీ చేయటం, ఆఫీసుకి వెళ్ళేప్పుడు కారియరు సర్దుకోవటం వంటివి ఆయనే చేస్తారట, అంతేకాదు సాయంకాలం ఇంటికి వచ్చాక ఉతికి ఆరేసిన బట్టల్ని మడతపెట్టడం, పిల్లలకి హోంవర్కులు చేయించటం పాలు కలిపివ్వటం అణ్ణం తినిపించి నిద్రపుచ్చటం కూడా చేస్తారట.” అని అంది మారుతున్న నా ముఖకవళికల్ని ఓరకంట గమనిస్తూ. ఏదొ ముంచుకొస్తోంది, అని గ్రహించిన నా కాళ్ళు వాటంతటవే అక్కడ్నుండి జారుకోమని మెల్లిగా కుర్చీలో నుండి లేవటం మొదలు పెట్టాయి… అది గమినించిన మా సూర్యకాంతం నా చెయ్యి పట్టుకుని కుర్చీలోకి నెట్టి కుర్చీ చెయ్యి మీద కూర్చుని నా బుజం మీద చెయ్యి వేసి గోముగా, “ ఏమండీ మనం కూడా అలా పనుల్ని పంచుకుందామండీ ఎంచక్కా పనమ్మాయి అవసరముండకుండా పనులన్ని అయిపోతాయి” అని అంది, త్వరగా ఏదో ఒక పాచిక వేసి అక్కడ్నుండి తప్పించుకోవాలని నేను, “చూడు బంగారం ఆ పక్కింటి దద్దోజనం మొహంగాడు ఏదో అలా చేస్తున్నంత మాత్రాన అందరికీ అది కుదుర్తుందా?, వాడు వెలగబెట్టేది సర్కారి కొలువులో ఉద్యోగమాయె, ఎన్నింటికి వెళ్ళినా గవర్నమెంటు ఉద్యోగంలో అడిగే నాథుడెవడుంటాడు? అక్కడికి వెళ్ళాక కూడా చక్కగా ఫ్యాను కింద గురకపెట్టడం తప్ప వాళ్ళకి పనేమి ఉండదే బోలెడు రెస్టూ… ఇక ఆ మాత్రమన్నా పనులు చెయ్యకపోతే అసలే లావు, ఇంకా బండగా అవుతాడు, వాడలా పని చేస్తే కాస్త బరువన్న తగ్గుతాడని దాక్టరు చెప్పుంటాడు అందుకే అలా చేస్తున్నాడే….. అంతమాత్రానికే వాడేదొ పరోపకారి పాపన్న లా ఇంటెడు చాకిరి చేస్తున్నట్టు అనుకుంటున్నావు నువ్వు… నిజం అర్ధం కాక నన్ను కూడా వాడిలా చెయ్యమంటున్నావు” అన్నాను నేనేదో రమణారావు లా సన్నగా ఉన్నట్టు.
అదంతా నాకనవసరం అన్నట్టు ఒక సారి గోడకున్న గడియారంకేసి చూసి, “ఆగండి చంటిగాడు నిద్రలేచే సమయం అయ్యింది, మళ్ళీ ఏడుస్తాడు కనపడకపోతే, వాడిని లేపి మీతో మాట్లాడతాను, ఇంతలో కొంచం ఆ పొయ్యి మీదున్న పాలని ఆరబెట్టి ఆ గట్టు మీదున్న వెండి గ్లాసులో పోసి ఆరబెట్టండి, చంటోడికి పట్టాలి అని హుకుం జారీ చేసి చంటోడి దగ్గరికి వెళ్ళింది లేచానా లేదా అని ఓ సారి మధ్యలో వెనక్కి తిరిగి చూసి…ఇంకేం చేస్తాం పోనిలే ఈ ఒక్క పని చేద్దాం ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఆ పనిమనిషిని బతిమిలాడో బామాలో మళ్ళీ రప్పిద్దామని అనుకుని వంటింట్లోకి దారితీసాను. పాలని “వెండి” గ్లాసులో (వీడి బారసాలలో చంటోడికి వెండి గ్లాసు, కాంతానికి బంగారు గ్లాసు, నాకేమో ఇత్తడి గ్లాసూ చేయించింది మా అత్త, ఇదేంటత్తా అని అడిగితే పుత్తడి బొమ్మలాంటి మా అమ్మాయిని ఇచ్చానుగా అదే నీకెక్కువల్లుడూ అంటూ లౌక్యంగా ఇచ్చిన ఆ ఇత్తడి గ్లాసుని కూడా లాగేసుకుంది మా సీనియరు సూర్యకాంతం) పోసుకుని ఆరబెడుతూ చంటోడి దగ్గరికి తీసుకెళ్ళాను, గ్లాసుని కాంతానికి ఇవ్వబోయేంతలో “ఏవండేవండి మా బుజ్జి కదూ కొంచం వీడికి పాలు పట్టండి కూరగాయలవాడొచ్చాడు వెళ్ళి ఓ నాలుగు కూరగాయలు కొంటాను, సొరకాయుంటే తీసుకుంటాలెండి, మీరెప్పట్నుండో అడుగుతున్నారుగా దప్పళం పెట్టమని.. “ అని వాకిట్లోకి పరిగెత్తింది ‘ఓ కూరలబ్బీ’ అని అరుచుకుంటూ, ఎదురుగా నిద్రమొహమేసుకుని నన్నే చూస్తున్న చంటిగాడిని చంకనేసుకుని, పాలుతాగించాను ‘ అమ్మో ఏదో ఒకటి చేసెయ్యాలి లేకుంటే నా పని ఇక ఇంటి పనే’ అనుకుంటూ, అప్పుడు నాకు తెలియదు ఇది ఆరంభానికి ఆరంభం మాత్రమేనని.
మొదటి రోజనే సాకుతో ఆవేళ నాకు పాలుతాగించటం వంటి చిన్న చిన్న పనులే చెప్పింది, ఆ మరుసటి రోజు నాకు ప్రమోషను చంటాడికి స్నానం, మధ్యాహ్నం అన్నం కడిగి పడేయటం… ఇలా నెలరోజులయ్యేటప్పటికి…. పొద్దున్నే కోడికూసేవేళకి లేచి పాలవాడి దగ్గర పాలు తీసుకుని కాఫీ పెట్టటం, ఈ లోగా మా ఆవిడవెళ్ళి వాకిలూడ్చి ముగ్గేసి రావటం, తను స్నానము మరియు పూజ ముగించుకుని వచ్చేలోగ నేను అంట్లు తోమి, కూరగాయలు తరగటం… ఇలా మొదలయ్యే దినచర్య సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక బట్టలు మడతపెట్టి ఇస్త్రీ చెయ్యటం (ఇది నా దినచర్యలో కొత్తగ చేరిన పని… అవును మరి ‘చాకలి వాడికెందుకు జతకి మూడున్నర రూపాయలు దండగ కదూ’,మా ఆవిడ ఉద్దేశ్యం) ఆ తర్వాత రాత్రికి భోజనం సిద్ధం చేసి, తిని తొంగోవటం ఇది మా పక్కింటి పంకజాక్షి మొగుడి పుణ్యమాని నా మెడకి చుట్టుకున్న సారీ చుట్టిన ఢోలు.
మరుసటి రోజు ఉదయం మా కాంతం ఎవరితోనో ఫోనులో ఓ ముప్పావుగంట మాట్లాడి మెల్లిగా వచ్చి “ఏవండోయ్ మా బందరు బాబయిగారు లేరూ…” అంటు నా చెవిలో ఊదింది, నేను, “ఎవరూ మీ సీత పిన్ని వాళ్ళాయనేగా? ఏమయిందాయనకి?” అని అడిగాను, “ఏమీ కాలేదండి ఆయనకి మన ఊరిలో ఏదో పని ఉందిట, రేపు సాయంకాలం బండికి మా పిన్నిని తీసుకుని వస్తున్నారట, మన ఇంట్లోనే బస” చల్లగా చెప్పింది కాంతం, “ఓహొ ఎన్ని రోజులుంటారో?” అడిగాను. “ఏమిటండీ మా వాళ్ళు వస్తున్నారు అనగానే మీరు అడిగే మొదటి ప్రశ్న అదేనా…అసలు కొంచమన్నా మర్యదివ్వండి మా వాళ్ళకి, మావాళ్ళేమి గతిలేక రావటం లేదు మన ఇంటికి, ఏదొ పని ఉండి వస్తున్నారు తీరా వచ్చాక ఈ ఊళ్ళో వాళ్ళమ్మాయిని నేనుండగా ఎక్కడో ఉంటే నేను బాధపడతాననే కానీ వాళ్ళేమీ దిక్కులేక రావటంలేదు సుమండీ…… ఐనా ఎణ్ణాళ్ళుంటె మీకెందుకూ… ఉంటారండి ఓ వారం రోజులుంటారు, లేకుంటే నెల రోజులుంటారు అసలిక్కడే ఉండిపోతారండి” అని ముక్కు ఎగబీలుస్తూ లోపలికెళ్ళి పోయింది. తిరణాళ్ళలో తప్పిపోయిన పిల్లవాడిలా నేను బిక్కమొహమేశాను, అసలిప్పుడేమన్నాని? ఎణ్ణాళ్ళుంటారు అని అడిగినంతమాత్రానికేనా ఈ రాద్దాంతం? లేక తెలియక నేనెమైనా అనేసానా? లేదే అంతే కదా నేను అంటా? అసలేంజరిగింది ఇప్పుడు? అని యక్షప్రశ్నలు వేసుకుంటూ పాలు పొంగబెట్టేశాను.
మూలిగే నక్కమీద తాటికాయన్నట్టు అది గమినించిన నా భార్యామణి, "ఇప్పుడేమన్నానని, ఎంత ఉక్రోషమైతే మాత్రం అలా వరాలంటి పాలు పొంగబెట్టేస్తారా ఇప్పుడు చంటోడికి పాలెలాగ? బజారుకెళ్ళి పాలు పట్రండి అని మళ్ళీ ఒకసారి హూంకరించి స్నానాలగది వైపుకి వెళ్ళింది". “ఎవరు చేసిన తప్పు వారనుభవించకా…..” అని పాడుకుంటు పొంగిన పాలు శుభ్రంచేసి తలుపులు ఓరగా వేసి మా వీధిచివరనున్న కిరాణ కొట్టుకెళ్తూంటే ఆ కొట్టు కోమటి తో మాట్లాడుతూ కనిపించింది ఆవిడ. వెంటనే గజేంద్రమోక్షంలోని పద్యాలన్ని నెమరువేసుకుంటూ ఆమెవైపు పరిగెత్తాను.
ఆమె ఎవరో కాదు మా ఓల్ద్ రంభ, అదే మా పనిమనిషి, ఎక్కడాలేని ప్రేమ, మమకారాలు నా గొంతులో మేళవించుకుని, “ఇదిగొ పెంటమ్మా (ఇదే మా పనిమనిషి అసలు పేరు), ఏమిటి అసలు రావటమే మానేశావు, రెండు వారాల క్రితం ఒకట్రెండుసార్లు వచ్చాను నిన్ను కలుద్దామని కాని నువ్వు ఊళ్ళో లెవని అన్నారు” అడిగాను ఏమీ తెలియనోడిలా, “ఏటో బావుగోరు, నానేట్సేయనేదు ఐనా అమ్మగోరు నాతో ఉత్తిపుణ్నానికి గొడవపడేసి నన్ను పొమ్మన్నరు. అసలేటయిందొ ఏటో, పెద్దోళ్ళని నేనొల్లకున్నానయ్య, నానిప్పుడు కూడా రమ్మంటే బాలొచ్చెత్తానయ్యగోరు” అని అంది, నాకర్ధం కాలేదు, “అదేమిటే ఏమీ అవ్వకుండా అలా ఎందుకు అంది? నువ్వేమైనా జీతం పెంచమన్నావా?”..”లేదు బాబయ్య నానెందుకు అడుగుతాను, మీరెంతిత్తె అంతేనమ్మ అనే గందా నాను మాటాడింది, నానడగలేదు బావు” ఇది విన్న నాకు దిమ్మ తిరిగింది. ఆ కోమిటి వాడి కొట్లోనుండి బ్యాక్ గ్రౌండులో పాట “ ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే…”. “సరే పెంటమ్మా నేనమ్మగారితో మాట్లాడి నీకు కబురుపెడతాన్లే, వచ్చి చేరుదువుగాని” అని అన్నాను, “అట్టానె బావు మారాజువి మళ్ళీ పని ఇప్పిత్తానంటాండావు, సల్లంగుండు” పాలు తీసుకుని వెనక్కి వస్తూ ఆలోచనలో పడ్డాను.
ఇంటికి వస్తూనే “ఏమే ఇలా రా నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఏంటొ, కాస్త మంచినీళ్ళు పట్టుకునిరా” అంటూ కుర్చీలో కూలబడ్డాను, “అయ్యో ఎమయిందండీ ఇందాక వరకూ బానే ఉన్నారుగా” అంటు నీళ్ళ గ్లాసు పట్టుకుని కంగారుగా వచ్చింది “ ఏమోనే ఈ మధ్య రోజూ ఇలా అవుతోంది పని వల్లనేమోలే అని ఊరుకున్నాను, కానీ ఈవేళ మరీ ఎక్కువగా ఉంది”, “హయ్యో ఏమిటండీ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, ఇలా అవుతుందనుకుంటె పని అమ్మాయిని మానిపించేదానిని కాదు” అంది, హమ్మయ్య రూటులోకొచ్చిందనుకుంటూ “పోనీ ఇప్పుడు మాత్రమేమయ్యింది ఆ పెంటమ్మని మళ్ళీ రమ్మనరాదూ, పనిలోకి, ఇక నావల్ల కాదే ఇలా బండెడు చాకిరి చెయ్యటం నే వెళ్ళి బ్రతిమిలాడి వస్తాను నీకభిమానమడ్డొస్తే, అసలే మీ బాబాయిగారొస్తున్నారంటున్నావు పని పెరుగుతుంది, పైగా నేను పెద్దగా ఏమి చెయ్యకున్నా వాళ్ళు ‘చూడు పాపం అబ్బాయి చేత ఇంటెడు చాకిరి చేయిస్తుంది కాంతం’ అని ముక్కునవేలేసుకోరూ? ” దీనంగా అన్నాను, “నిజమేనండీ కాని ఆ పీనుగ డబ్బులు పెంచమంటుంది కదండీ ఇప్పుడెళ్ళి పిలిస్తే లోకువైపోమూ”… అని అంది నీళ్ళు నములుతూ, బిత్తర చూపులు చూస్తూ, మొన్న నేను “నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి” అని పాడుకుంటూ ఇల్లు తుడుస్తున్నప్పుడు ఆ మహాతల్లి వినిందేమొ ఈ సీతమ్మ పిన్ని రూపంలో నన్ను ఆదుకుంది అని ఒకవైపు సంబరపడుతూ, “సర్లేవే నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడివస్తాను సాయంత్రానికి మీ పిన్నీవాళ్ళొస్తారు కదా, ఇక దాని జీతం అంటావా పైస కూడా పెంచను, ఆ రెండు వీధులవతలి మూడో గుడిశేగా అదుండేది” అని అడిగాను వాకిలి వైపు వెల్తూ. ఓక్కసారిగా లేడి పిల్లలా ఛెంగున ఎగిరి నా చెయ్యి పట్టుకుని, “ వద్దులెండి మీరు వెళ్తే ఒకటి నేను వెళ్తె ఒకటీనా, నేనే వెళ్తాను ఏదొ ఒకటి చెప్పి మళ్ళీ పనిలోకి రమ్మని అడుగుతానులె” అని పనిమనిషిని పిలవటానికి వెళ్ళింది మా ఆవిడ.
ఒక గంటాగి మా కాంతంతో కూడా వస్తున్న పెంటమ్మను చూస్తే ఎప్పటిలా చింపిరి జుత్తూ, ఎత్తుచీర కట్టుకునుండే మా ఓల్డు రంభ పెంటమ్మే, గజేంద్రుడ్ని కాపాడటానికి చింద్రవందరగా వస్తున్న శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపించింది నాకు. ఆవేల్టి సాయంత్రం మా కాంతం జరిగినదంతా వాళ్ళ పిన్నితో “చూడవే అమ్మ చెప్పిందికదా అని మా పక్కింటి పంకజాం దగ్గర డాబు పోటానికి మీ అల్లుడుగారిచేత పనులు చేయించానా, ఇప్పుడెమో నీ రాక పుణ్యమాంట మళ్ళీ కథ మొదటికొచ్చింది పైగా ఆ పెంటమ్మకేమొ ఇప్పుడు నిజంగానే మూడువందలాయాభై ఇవ్వాల్సివస్తుంది, అసలు అది నాలుగు వందల దగ్గర బేరం మొదలు పెట్టింది, లేకుంటే మీ ఇంట్లో ఇన్ని రోజులు అన్ని పనులూ చేసింది మీ అల్లుడుగారే అని ఊరంతా టాంటాం వేస్తానని భీష్మించుక్కూర్చుంది పైగా జరిగినదంతా మీ అల్లుడిగారికి చెప్పేస్తానని బెదిరించింది దొంగముండ, ఆఖరికి బ్రతిమిలాడి బామాలి మూడువందలయాభైకి మాట్లాడాల్సి వచ్చింది యే గొడవాలేకుండా మూడు వందలకి పనిచేసే దానిని అనవసరంగా గొడవపడి పంపినందుకు నాకు తగిన శాస్తి జరిగింది” అని చెప్పుకుంటూ వాపోయింది. పాపం ఈ దానయ్యే పనిమనిషిచేత అలా బెట్టు చేయించాడని తెలియదు తనకి…
ఇదండీ నా ఈ రెండు నెలాల అఙాతవాసానికి కారణం ఏవిటీ అఙాతవాసంతో పోల్చానని చూస్తున్నారా? మరి అఙాతవాసంలోనే కదండి అంత గొప్పవారైన పాండవులే పనివాళ్ళుగా మారిందీ.. ‘కుంజరయూదంబు దోమకుత్తుకజొచ్చెన్’ అని…. ఇక పై మళ్ళీ మామూలుగానే మరీ ఇంత గ్యాపు లేకుండా మీతో మాట్లాడతానని ఆశిస్తు…
భవదీయుడు,
ఇప్పుడే మళ్ళీ దారిలోకొస్తున్న దానయ్య.
Subscribe to:
Posts (Atom)